తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టుకున్న పోలీసులు

రేషన్​ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇద్దరిని హైదరాబాద్​ సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 18, 2020, 4:50 PM IST

taskforce police catch ration rice in hyderabad
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టుకున్న పోలీసులు

ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలలో బియ్యం అందించింది. ఈ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. హైదరాబాద్​లోని నవాబ్ సాబ్ కుంటా ప్రాంతానికి చెందిన మొసీన్, ఛత్రినాక ఉప్పుగూడకి చెందిన సోగుల రామాంజనేయులు ఇద్దరు తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేశారు.

వాటిని కర్ణాటకలోని హుమ్నాబాద్​కి తరలించడానికి ప్రయత్నిస్తుండగా సౌత్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు ఛత్రినాకలో అదుపులోకి తీసుకుని 12 టన్నుల బియ్యం, ఒక లారీ, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ABOUT THE AUTHOR

...view details