తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 10:56 PM IST

ETV Bharat / state

విజయనగరం చేరుకున్న వీర జవాన్ రౌతు జగదీశ్ భౌతికకాయం

ఛత్తీస్​గఢ్ రాష్ట్రం బీజాపూర్ వద్ద జరిగిన మావోయిస్టుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ రౌతు జగదీశ్ పార్థివదేహం ఏపీలోని విజయనగరం చేరుకుంది. జగదీశ్ భౌతికకాయానికి స్థానికులు, పోలీసులు ఘన నివాళులర్పించారు.

routhu jagadeesh, ap news
jagadeesh, encounter

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యలో వీరమరణం పొందిన ఏపీకి చెందిన సీఆర్​పీఎఫ్ జవాన్‌ రౌతు జగదీశ్‌ భౌతికకాయం విజయనగరం చేరుకుంది. ఈ సందర్భంగా.. జగదీశ్‌ భౌతికకాయం వెంట యువకులు జాతీయ జెండాలు చేతపట్టి.. ఘనస్వాగతం పలికారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. జిల్లా సరిహద్దుల నుంచే అడుగడుగునా.. జగదీశ్ భౌతికాయానికి పోలీసులు, స్థానికులు ఘన నివాళ్లు అర్పించారు.

విజయనగరం చేరుకున్న వీర జవాన్ రౌతు జగదీశ్ భౌతికకాయం

నగరంలోని ఆర్టీవో కార్యాలయం, కలెక్టరేట్ కూడలి మీదుగా గాజులరేగలోని జగదీశ్ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details