తెలంగాణ

telangana

నిర్మలా సీతారామన్​ను కలిసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

By

Published : Sep 10, 2020, 5:53 PM IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయట్లేదని... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు తెలిపినట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆర్థిక విధానాలు చేస్తోందని ఆరోపించారు.

nvss-prabhakar-meets-nirmala-sitharaman-to-complaint-against-of-telangana-government
నిర్మలా సీతారామన్​ను కలిసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేస్తూ... కేంద్ర నిధులు దారి మళ్లిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్​ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లేదని... కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

నిర్మలా సీతారామన్​ను కలిసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

దిల్లీలోని నార్త్‌ బ్లాక్‌ కార్యాలయంలో నిర్మలా సీతారామన్​ను ఆయన కలిశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్న నిధులను... రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయుష్మాన్​ భారత్‌ అమలు చేయట్లేదని సీతారామన్​కు చెప్పినట్లు వెల్లడించారు. రైతులకు చెందిన ఫసల్ భీమాకు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్ల వేలాదిమంది రైతులు లక్షల రూపాయల నష్టపరిహారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

ఇదీ చూడండి:ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details