తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

తల్లిదండ్రులు, విద్యార్థుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు బోర్డు మరో రెండ్రోజులు గడువు పెంచింది. ఇంటర్​ పరీక్షలు జరిగే సమయంలో జేఈఈ, బిట్​శాట్​ ప్రవేశ పరీక్షలు ఉన్నందున షెడ్యూలు మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

By

Published : May 2, 2019, 8:05 PM IST

ఇంటర్​ ఫీజు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగించారు. తల్లిదండ్రుల వినతి మేరకు ఈనెల 4వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 26, 27 తేదీల్లో బిట్​శాట్, జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలు ఉన్నందున... సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ అంశంపై పునర్​ సమీక్షించి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని బోర్డు కార్యదర్శి తెలిపారు.

ఇంటర్​ ఫీజు గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details