తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరాభివృద్ధికి కృషి చేయండి

హైదరాబాద్ మహానగర పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్​ సాధన అనే అంశంపై బంజారాహిల్స్​లో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

By

Published : Mar 6, 2019, 2:02 PM IST

సదస్సులో ప్రసంగిస్తున్న జీహెచ్​ఎంసీ కమిషనర్

స్వచ్ఛ హైదరాబాద్​ సాధన అనే అంశంపై సదస్సు

స్వచ్ఛంద సంస్థల సహకారం, పౌర సంస్థల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ సాధన అనే అంశం పై బంజారాహిల్స్​లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ రాములు, జీహెచ్​ఎంసీ కమిషనర్ దాన కిషోర్​ హాజరయ్యారు. స్వచ్ఛ ర్యాంకులతో సంబంధం లేకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పిలుపునిచ్చారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నగర వాసులు అభివృద్ధిలో తమ వంతు బాధ్యత కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details