తెలంగాణ

telangana

ETV Bharat / state

చార్మినార్​లో అభివృద్ధి పనులను పరిశీలించిన దానకిశోర్

మే 5 నుంచి ప్రారంభమవుతున్న రంజాన్​ మాసంలో మసీద్​లో ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. చార్మినార్​ వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

By

Published : Apr 27, 2019, 8:28 PM IST

జీహెచ్​ఎంసీ కమిషనర్​

​ చార్మినార్ వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ ప‌రిశీలించారు. రంజాన్​ సందర్భంగా మక్కామసీద్​లో​ ఏర్పాట్లు, బహదూర్​గూడ, ఓవైసీ జంక్షన్​, చాంద్రాయణగుట్టల్లో పనుల పురోగతిని స్వయంగా సమీక్షించారు. మే 5 నుంచి రంజాన్​ మాసం ప్రారంభమవుతున్నందున మసీద్​లో ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. ప్రాజెక్టు పనులన్నింటినీ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన జీహెచ్​ఎంసీ కమిషనర్​

ABOUT THE AUTHOR

...view details