తెలంగాణ

telangana

ETV Bharat / state

జనసేనాని పవన్​కల్యాణ్​పై జూబ్లీహిల్స్​లో కేసు

జనసేన పార్టీ అధినేత  పవన్ కల్యాణ్​పై హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్​లో కేసు నమోదైంది. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే విధంగా పవన్ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేత కొంతం గోవర్దన్​రెడ్డి  ఫిర్యాదు చేశారు.

By

Published : Mar 24, 2019, 11:42 PM IST

Updated : Mar 25, 2019, 12:23 AM IST

పవన్​ కల్యాణ్​పై జూబ్లీహిల్స్​లో కేసు

పవన్​ కల్యాణ్​పై జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న భీమవరంలో జరిగిన సభలో జనసేన పార్టీ అధినేత పవన్​కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీస్టేషన్​లో కేసు నమోదైంది. ప్రచార సభలో పవన్​కల్యాణ్​ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తెలంగాణ అడ్వకేట్​ జేఏసీ నేత కొంతం గోవర్దన్​ రెడ్డి ఫిర్యాదు చేశారు. పవన్​పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ కేసులో చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్​ సీఐ బాలకృష్ణ తెలిపారు.
Last Updated : Mar 25, 2019, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details