తెలంగాణ

telangana

'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'

హైదరాబాద్​లో ఇటీవలే తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి హత్య చేసిన కేసులో తల్లి ఫరహత్ బేగం బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం తన నివాసంలో మానసిక క్షోభకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

By

Published : Feb 8, 2020, 9:58 AM IST

Published : Feb 8, 2020, 9:58 AM IST

'మానసిక వేదనతో ఆత్మహత్య'
'మానసిక వేదనతో ఆత్మహత్య'

హైదరాబాద్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్​లో అబ్దుల్ రషీద్ , నేహా జబ్బిన్​లకు విషమిచ్చి హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన తల్లి ఫరహత్ బేగం విడుదలయ్యారు. ఇటీవలే బెయిలుపై వచ్చిన బేగం మానసికంగా కుమిలిపోయారు.

ఫలితంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి : బావను కత్తితో పొడిచిన బావమరుదులు

ABOUT THE AUTHOR

...view details