తెలంగాణ

telangana

వాడివేడిగా ఆదిలాబాద్‌ పురపాలక సమావేశం

By

Published : Oct 1, 2020, 1:06 PM IST

ఆదిలాబాద్ పురపాలక సమావేశం వాడివేడిగా కొనసాగింది. నిధుల విడుదల అంశంపై వార్డు కౌన్సిలర్లు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోందని పలువురు ఛైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Muncipal Corporation meeting in  Adilabad
వాడివేడిగా ఆదిలాబాద్‌ పురపాలక సమావేశం

ఆదిలాబాద్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. పలువురు వార్డు కౌన్సిలర్లు నిధుల విడుదల విషయంపై ఆరాతీశారు.

ప్రస్తుతం ఆయా నిధులతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లేదని ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. పనులను పరిశీలించి నాణ్యత పాటిస్తేనే బిల్లులు చెల్లించాలని పురపాలక ఛైర్మన్‌ అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:ఆదిలాబాద్​ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ప్రైవేటు వాహన యజమానుల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details