తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు

హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​​ రాఠోడ్​ విమర్శించారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్​ ఎంపీలను గెలిపించాలని కోరారు.

By

Published : Mar 16, 2019, 10:24 PM IST

కాంగ్రెస్​ ఎంపీలను గెలిపించండి..!

కాంగ్రెస్​ ఎంపీలను గెలిపించండి..!
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్‌ ఆరోపించారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనార్టీల రిజర్వేషన్ల హామీలపై తెరాస నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెరాస, భాజపాకు బదులు కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని రమేశ్​ రాఠోడ్‌ విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details