మూడు ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలతో గాడిన పడిందనుకున్న సన్రైజర్స్కు షాక్ తగిలింది. సారథి కేన్ విలియమ్సన్ చెన్నై సూపర్కింగ్స్తో జరగనున్న నేటి మ్యాచ్కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమైనట్లు సన్రైజర్స్ యాజమాన్యం వెల్లడించింది. భువనేశ్వర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
న్యూజిలాండ్ వెళ్లిన విలియమ్సన్ ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. ఈ సీజన్లో గాయం కారణంగా విలియమ్సన్కు బదులు చాలా మ్యాచ్లకు భువనేశ్వర్ సారథ్యం వహించాడు. 9 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఐదు విజయాలతో...పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.