తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి రెచ్చిపోయిన వార్నర్​.. పంజాబ్ లక్ష్యం 213

పంజాబ్​తో మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది హైదరాబాద్. ఓపెనర్ వార్నర్ 81 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అశ్విన్, షమి తలో రెండు వికెట్లు తీశారు.

By

Published : Apr 29, 2019, 10:15 PM IST

Updated : Apr 29, 2019, 10:23 PM IST

వార్నర్ మరో అర్ధ సెంచరీ.. పంజాబ్ లక్ష్యం 213

సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్ బ్యాటింగ్​తో ఆకట్టుకుంది. ఈ సీజన్​లో చివరి మ్యాచ్​ ఆడుతున్న వార్నర్ 81 పరుగులతో రాణించాడు.

టాస్ గెలిచిన పంజాబ్​ హైదరాబాద్​కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్, సాహా రెచ్చిపోయి ఆడారు. 4 ఓవర్లలోనే వీరిద్దరూ కలిసి 50 పరుగులు చేశారు. ఈ సీజన్​లో 77 పరుగులతో అత్యధిక పవర్​ ప్లే స్కోరు నమోదు చేశారు. ఆ వెంటనే 28 పరుగులు చేసిన సాహా ఔటయ్యాడు.

రెచ్చిపోయిన వార్నర్..

వన్​ డౌన్​లో వచ్చిన మనీశ్ పాండే సహకారంతో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలోనే మరో అర్ధసెంచరీ చేశాడు. జట్టు స్కోరు 160 వద్ద మనీశ్ పాండే 36 పరుగులు చేసి ఔటయ్యాడు. కొద్ది సేపటికే 81 పరుగులు చేసిన వార్నర్.. అశ్విన్ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో నబీ 20, విలియమ్సన్ 14, రషీద్ ఖాన్ 1, విజయ్ శంకర్ 7, అభిషేక్ 5 పరుగులు చేశారు.

పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమి తలో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు.

Last Updated : Apr 29, 2019, 10:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details