రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ వేసిన బంతి నోబాల్ కావడంపై నాన్ స్ట్రయికర్ బ్యాట్సెమన్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే డగౌట్లో ఉన్న ధోనీ... గ్రౌండ్లోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. ఫలితంగా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత రూపంలో శిక్ష ఎదుర్కొన్నాడు. ధోనీ ప్రవర్తించిన తీరుపై రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ విమర్శలు గుప్పించాడు.
ధోనీ తీరుపై మాజీ క్రికెటర్ల విమర్శలు
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్లో ధోనీ డగౌట్ నుంచి మైదానంలోకి వెళ్లడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. ధోనీ సహనం కోల్పోయాడని కొందరు అనగా... ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు.
former-cricketers-reacts-on-dhoni
' నేను బౌండరీ దగ్గర ఫీల్డింగ్లో ఉన్నాను. నిజానికి పిచ్ వద్ద ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నా అభిప్రాయం ప్రకారం ధోనీ గ్రౌండ్లోకి అడుగుపెట్టడం మంచి పని కాదు '.
-- జోస్ బట్లర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు
బట్లర్తో పాటు మరికొందరు మాజీలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు.