తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాజీ క్రికెటర్ చంద్రశేఖర్​​ ఆత్మహత్య

టీమిండియా మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతిచెందారు. భారత్​ తరఫున ఏడు వన్డేలు ఆడారు చంద్రశేఖర్.

By

Published : Aug 16, 2019, 10:54 AM IST

Updated : Sep 27, 2019, 4:17 AM IST

చంద్రశేఖర్

భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ గురువారం మృతిచెందారు. చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే ఆయన బలవన్మరణానికి కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.

చంద్రశేఖర్​ గుండెపోటుతో మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యేనని ధ్రువీకరించారు.

వీబీ చంద్రశేఖర్​

1988 నుంచి 1990 వరకు భారత్​ తరఫున ఏడు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 88 పరుగులు చేశారు చంద్రశేఖర్​. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్​మన్ దేశవాళీలో 81 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ ఆడారు. 4వేల 999 పరుగులు చేశారు. ఈయన అత్యుత్తమ స్కోరు 237 నాటౌట్​.

భారత్​ తరఫున ఏడు వన్డేలాడిన చంద్రశేఖర్

గ్రెగ్​చాపెల్ టీమిండియా కోచ్​గా ఉన్న సమయంలో చంద్రశేఖర్ జాతీయ జట్టుకు సెలక్టర్​గా బాధ్యతలు నిర్వర్తించారు.

చంద్రశేఖర్‌ 25 ఏళ్ల వయసులో తమిళనాడు రంజీ జట్టు తరఫున తొలిసారి క్రికెట్‌ ఆడారు. ఈ ఫార్మాట్‌లో 56 బంతుల్లోనే శతకం బాది, అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ ప్రదర్శనతోనే ఆయన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

ఇది చదవండి: రన్​ మెషీన్​... రికార్డులు చెదిరెన్..!​

Last Updated : Sep 27, 2019, 4:17 AM IST

ABOUT THE AUTHOR

...view details