తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2020, 3:45 PM IST

Updated : Feb 29, 2020, 12:39 AM IST

ETV Bharat / sports

కివీస్​తో వన్డే, టెస్టు సిరీస్​కు రోహిత్ దూరం

న్యూజిలాండ్​తో జరిగే వన్డే, టెస్టు సిరీస్​కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. కివీస్​తో జరిగిన ఐదో టీ20లో గాయపడ్డాడు రోహిత్.

రోహిత్
రోహిత్

న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్​తో జరిగే వన్డే, టెస్టు సిరీస్​కు స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇతడి స్థానంలో మయాంక్​ అగర్వాల్​ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

"రోహిత్ కివీస్ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి గాయం కోలుకునేలా లేదు. ఆ గాయం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. సెక్రటరీ అనుమతి తర్వాత మరో ఆటగాడిని ఎంపిక చేస్తాం."
-బీసీసీఐ అధికారి

కివీస్​తో జరిగిన చివరిదైన ఐదో టీ20లో గాయపడ్డాడు రోహిత్. 60 పరుగులు చేసి రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు. అనంతరం ఫీల్డింగ్​ చేయడానికి రాలేదు. ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల అతడు ఈ పర్యటనకు దూరం కానున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Last Updated : Feb 29, 2020, 12:39 AM IST

ABOUT THE AUTHOR

...view details