తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సచిన్​ను ఔట్ చేసినందుకు చంపేస్తామన్నారు'

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను 2011లో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో ఔట్​ చేయడం వల్ల తనను చంపేస్తామని బెదరింపులు వచ్చినట్లు తెలిపాడు ఇంగ్లాండ్​ పేసర్​ టిమ్ బ్రెస్నన్​. ఒకవేళ సచిన్​ను ఔట్​ చేయకపోయి ఉంటే తన వందో ​సెంచరీ పూర్తి చేసుకునే వాడని అన్నాడు.

By

Published : Jun 8, 2020, 9:11 AM IST

Updated : Jun 8, 2020, 10:18 AM IST

sachin
సచిన్​

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ను ఔట్​ చేసినందుకు చంపేస్తామంటూ బెదరింపులు వచ్చాయని తెలిపాడు ఇంగ్లాండ్​ పేసర్​ టిమ్​ బ్రెస్నన్​.

2011 వన్డే ప్రపంచకప్​లో​ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో చేసిన సెంచరీతో 99 శతకాలు పూర్తి చేసుకున్నాడు సచిన్​. అనంతరం అదే ఏడాది ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ జరిగింది. అందులో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో 91 పరుగుల వద్ద సచిన్​ను ఎల్బీడబ్ల్యూ చేశాడు టిమ్​ బ్రెస్నన్. దీంతో మాస్టర్​కు తన వందో సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం చేజారిపోయింది. ఫలితంగా అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఆ తర్వాత "నిన్ను చంపేస్తాం" అంటూ చాలామంది ట్విట్టర్​లో బెదరించడం ప్రారంభించారని చెప్పాడు బ్రెస్నన్. సచిన్‌ను ఔట్​ ఇవ్వడానికి ఎంత ధైర్యం అంటూ అంపైర్ రాడ్ టక్కర్​ను ప్రశ్నించారని తెలిపాడు.

"కొన్నిరోజుల తర్వాత అంపైర్‌ టక్కర్​ను కలిశాను. అప్పటికే బెదరింపులు రావడం వల్ల ఆయన కూడా నాలాగా సెక్యూరిటి గార్డు, పోలీసుల బందోబస్తు నియమించుకున్నాడు."

-బ్రెస్నన్, ఇంగ్లాండ్ పేసర్

అనంతరం 2012 ఆసియా కప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో శతకం బాది తన వందో సెంచరీ పూర్తి చేసుకున్నాడు సచిన్​. 2013లో క్రికెట్​కు వీడ్కోలు పలికిన మాస్టర్.. కెరీర్​లో టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు.

ఇది జరిగింది : క్రికెట్ ​X కరోనా : పోరులో గెలిచేదెవరు?

Last Updated : Jun 8, 2020, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details