తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్రికెటర్లూ.. అప్పటికి దెబ్బలేం తగిలించుకోకండి'

క్రికెట్​ పునఃప్రారంభమయ్యేసరికి ఆటగాళ్లందరూ మానసికంగా దృఢంగా తయారవ్వాలని సూచించారు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​​ సందీప్​ పాటిల్​. శరీరానికి ఎటువంటి గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

By

Published : Jun 21, 2020, 8:05 PM IST

sandeep patel
సందీప్​ పాటిల్​

కరోనా వల్ల స్తంభించిపోయిన క్రికెట్​ పునః ప్రారంభమయ్యేసరికి క్రికెటర్లందరూ మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మెన్​ సందీప్​ పాటిల్​. ఈ లాక్​డౌన్​లో శరీరానికి ఎటువంటి గాయాలు తగలకుండా, ఫిట్​గా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. అయితే ఈ సూచనలు ఆటగాళ్లకు ఓ పెద్ద సవాల్​ లాంటిదని చెప్పుకొచ్చారు. గాయలైతే జట్టులో చోటు ప్రశ్నార్థకం కావొచ్చని అభిప్రాయపడ్డారు.

63ఏళ్ల ఈ మాజీ ఆటగాడు... తన కెరీర్​లో మొత్తం 29 టెస్టులు, 1983లో ప్రపంచకప్​లో ఆడారు. ఈ ప్రపంచకప్​లో ఆటగాళ్లు​ మానసికంగా దృఢంగా ఉండటం వల్లే జట్టు విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.

వచ్చే నెలలో ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​తో అంతర్జాతీయ క్రికెట్​ పునః ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి : ప్రమాదంలో వికెట్​కీపర్​ కారు నుజ్జు నుజ్జు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details