తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 9:19 PM IST

Updated : Feb 29, 2020, 11:02 AM IST

ETV Bharat / sports

అండర్ 19 కప్పు కోసం భారత్-బంగ్లాదేశ్ ఢీ

అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్లో ఢీకొట్టనున్నాయి భారత్-బంగ్లాదేశ్. న్యూజిలాండ్​పై సెమీస్​లో గెలిచి, తుదిపోరుకు అర్హత సాధించింది యువ బంగ్లా.

అండర్ 19 కప్పు కోసం భారత్-బంగ్లాదేశ్ ఢీ
భారత యువ క్రికెట్ జట్టు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్​లో కప్పు కోసంభారత్​తో తలపడే ప్రత్యర్థి ఎవరో ఖరారైంది. గురవారం జరిగిన సెమీ ఫైనల్​లో న్యూజిలాండ్​ను ఓడించి, ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్​కు చేరింది బంగ్లాదేశ్​. ఆదివారం జరిగే తుదిపోరులో గెలిచిన జట్టు.. విజేతగా నిలవనుంది.

తొలిసారి అండర్ -19 క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్​కు చేరిన బంగ్లాదేశ్

పోచ్​స్ట్రోమ్​ వేదికగా గురువారం జరిగిన సెమీస్​లో న్యూజిలాండ్​ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని 44.1 ఓవర్లలోనే ఛేదించి, 6 వికెట్ల తేడాతో గెలిచింది యువ బంగ్లా. మహ్మదుల్ హసన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

అంతకు ముందు మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో దాయది పాకిస్థాన్​ను 10 వికెట్ల తేడాతో ఓడించింది యువ భారత్. ఈ టోర్నీలో ఏడోసారి ఫైనల్​కు అర్హత సాధించింది.

Last Updated : Feb 29, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details