టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) తీవ్రమైన ఒత్తిడి మధ్య బరిలో దిగనుందని, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈసారి పతకం సాధించడం అంత తేలిక కాదని మాజీ క్రీడాకారిణి జ్వాలా గుత్తా(Jwala Gutta) అభిప్రాయపడింది.
"సింధు పతకం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నా. కానీ గత ఒలింపిక్స్ కంటే ఈ సారి ఆమెపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి ఆమె మీదే ఉంది. ఆ ఒత్తిడిని ఆమె ఎలా స్వీకరిస్తుందన్న దానిపైనే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. కోచ్ల విషయంలో సింధు గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అందుకే ఒలింపిక్స్కు ముందు ఉండాల్సిన నిలకడ లేదు. కరోనా కారణంగా భారత షట్లర్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ దక్కకపోవడం ఓ పెద్ద ప్రతికూలత. సింధు తన గత మ్యాచ్ల వీడియోలు చూసి వ్యూహాలు రచించాలి" అని జ్వాలా వెల్లడించింది.