భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్హాసన్ను కలిసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈమె.. మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ కార్యక్రమంలో ఆయనతో భేటీ అయింది.
ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచింది సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా నిలిచింది. ఈ విషయంపై మాట్లాడిన కమల్.. ఈ విజయం దేశానికే గర్వకారణమని అన్నారు.
అయితే తన తర్వాతి లక్ష్యం వచ్చే ఏడాది ఒలింపిక్స్లో పతకం సాధించడమేనని చెప్పింది సింధు.