తెలంగాణ

telangana

నటుడు కమల్​హాసన్​తో పీవీసింధు భేటీ

By

Published : Oct 10, 2019, 6:35 PM IST

లోకనాయకుడు కమల్​హాసన్​తో స్టార్ షట్లర్ పీవీసింధు భేటీ అయింది. తను అభిమానించే వారిలో ఈయన ఒకరని చెప్పింది.

నటుడు కమల్​హాసన్​తో పీవీసింధు భేటీ

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్​హాసన్​ను కలిసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈమె.. మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ కార్యక్రమంలో ఆయనతో భేటీ అయింది.

ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం గెలిచింది సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా నిలిచింది. ఈ విషయంపై మాట్లాడిన కమల్.. ఈ విజయం దేశానికే గర్వకారణమని అన్నారు.

అయితే తన తర్వాతి లక్ష్యం వచ్చే ఏడాది ఒలింపిక్స్​లో పతకం సాధించడమేనని చెప్పింది సింధు.

"అవును. నా తర్వాతి లక్ష్యం 2020 ఒలింపిక్స్​లో పతకం సాధించడం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉంటూ తీవ్రంగా శ్రమిస్తున్నా. ఈ టోర్నీలో పూర్తిస్థాయిలో రాణించి బంగారు పతకం గెలిచేందుకు కృషి చేస్తాను" -పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్

అయితే కమల్ హాసన్​ను సూపర్​స్టార్ అని ప్రశంసించిన సింధు.. తను అభిమానించే వారిలో ఈయన ఒకరని చెప్పింది.

ఇది చదవండి: జాతీయ గీతం పాడుతుంటే సింధు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..!

ABOUT THE AUTHOR

...view details