తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 4:53 PM IST

ETV Bharat / sitara

కథ కోసం పరుచూరి గోపాలకృష్ణను కొట్టిన ఎన్టీఆర్!

'మేజర్ చంద్రకాంత్' కోసం సీనియర్ హీరో ఎన్టీఆర్..​ పరుచూరి గోపాలకృష్ణను ఓ సందర్భంలో కొట్టారట. ఓ వేడుకలో వీరిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే సినిమా పూర్తవడానికి కారణమైందట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

మేజర్‌ చంద్రకాంత్‌’ కోసం పరుచూరిని ఎన్టీఆర్‌ కొట్టారట!

సీనియర్​ హీరో నందమూరి తారక రామారావు 'మేజర్‌ చంద్రకాంత్‌' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, పరుచూరి సోదరులు అందించిన కథ, మాటలు.. చిత్ర విజయానికి ఓ కారణమయ్యాయి.

అప్పటికే ఎన్నో సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్.. ఇలాంటి గొప్ప చిత్రానికి కథ రాసేందుకు చాలా సమయం తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ 'మేజర్ చంద్రకాంత్' విషయంలో అలా జరగలేదు. హీరో ఎన్టీఆర్‌.. పరుచూరి గోపాలకృష్ణను కొట్టడం వల్లే ఈ కథ.. వెండితెరపై ఆవిష్కృతమైంది.

ఇది అసలు విషయం!

పరుచూరి సోదరులతో కథ రాయించుకోవాలని ఎన్టీఆర్‌ ఎప్పటి నుంచో అనుకునేవారట. కానీ వారు సమాధానమిచ్చేవారు కాదు. ఈ క్రమంలో గోపాలకృష్ణ.. ఓ వేడుకకు హాజరవగా, అదే సమయంలో ఎన్టీఆర్‌ అక్కడకు వెళ్లారట. అక్కడ ఏం జరిగిందోగోపాలకృష్ణ, ఆ తర్వాత ఓ సందర్భంలో చెప్పారు.

"ఎన్టీఆర్ మళ్లీ కథ అడుగుతారనే భయంతో మేం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించాం. కానీ ఆయన అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి కొట్టారు. ఏం బ్రదర్స్‌ కథ ఏమైంది? అని అన్నారు. సిద్ధం కాలేదని చెప్తే ఈ సారి ఏం చేస్తారో అని, అయిపోయిందని సమాధానం ఇచ్చాం"

-పరుచూరి గోపాల కృష్ణ, కథా రచయిత

పరుచూరి బ్రదర్స్..ఆ తర్వాత రాత్రంతా నిద్రపోకుండా, తీవ్ర చర్చలు జరిపి 'మేజర్ చంద్రకాంత్' కథ సిద్ధం చేశారట. ఇలా ఆ సినిమా రూపొందింది. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్‌ గాయనుల సందడి

ABOUT THE AUTHOR

...view details