తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 5:49 PM IST

ETV Bharat / sitara

ట్రైలర్​: 'దేశంలో క్రీడాకారుడికి కనీస గౌరవం ఇవ్వట్లేదు!'

యువ కథానాయకుడు సందీప్​కిషన్​, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న కొత్త చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్​'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ట్రైలర్​లో సందీప్​కిషన్​ చెప్పే డైలాగ్​ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

Sundeep Kishan's a1 express movie official trailer released
ట్రైలర్​: 'దేశంలో క్రీడాకారుడికి కనీస గౌరవం ఇవ్వట్లేదు!'

'మన దేశంలో స్పోర్ట్స్‌మెన్‌కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు సర్‌. ఇక్కడ స్పోర్ట్స్‌ బిజినెస్‌ అయి చాలా కాలం అయింది. ఏ స్పోర్ట్స్‌ చూడాలో.. ఏది చూడకూడదో బిజినెస్‌మెన్‌ నిర్ణయిస్తున్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందీప్‌ కిషన్‌. జీవన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. లావణ్య త్రిపాఠి కథానాయిక.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌, లావణ్యలు హాకీ ప్లేయర్లుగా కనిపించారు. మరి హాకీ ఆడేందుకు వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని అధిగమించి ఎలాంటి విజయాలను నమోదు చేశారన్న విషయాలు తెలియాంటే సినిమా చూడాల్సిందే!

ఇదీ చూడండి:'ఉప్పెన' రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details