తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నీ కన్నులు అలిసేలా నీకు కనిపిస్తా'

'సాహో' చిత్రంలో 'ఏ చోట నువ్వున్నా..' అనే సాంగ్ టీజర్ విడుదలైంది. పూర్తి పాట ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది.

By

Published : Jul 30, 2019, 1:46 PM IST

సాహో

ప్రభాస్ నటించిన సాహోలో ఏ చోట నువ్వున్నా.. సాంగ్​ టీజర్ విడుదలైంది. 36 సెకండ్ల పాటు సాగుతుందీ గేయం. హరిచరణ్, తులసికుమార్ ఈ పాటను ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు.

పూర్తి పాటను ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. 'నీ కన్నులు అలిసేలా.. నీకు కనిపిస్తాలే' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. గురు రాంధ్వా ఈ పాటకు బాణీలు సమకూర్చాడు.

జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'అవతార్ టైటిల్ కామెరూన్​కు ఇచ్చింది నేనే'

ABOUT THE AUTHOR

...view details