పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయంపై రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అలా సూపర్ స్టార్ రజనీ కాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
"దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలు నన్ను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏ సమస్యకైనా హింస, అల్లర్లు పరిష్కారం కాకూడదు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలి. దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి."