తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో పూరీ 'జనగణమన'

దర్శకుడు పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమాపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండతో 'జనగణమన' తీస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ప్రేక్షకులకు పండగే.

By

Published : Jul 22, 2019, 4:04 PM IST

Updated : Jul 22, 2019, 5:12 PM IST

విజయ్ దేవరకొండతో పూరీ 'జనగనమణ'

'ఇస్మార్ట్ శంకర్'​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం రూ.50 కోట్ల గ్రాస్​కు చేరువలో ఉంది. ఇప్పుడు మరో విషయం ఆసక్తి రేపుతోంది. పూరీ తర్వాత​ చేయబోయే చిత్రంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు పూరీ జగన్నాథ్

మహేశ్​బాబుతో తీయాలనుకున్న 'జనగణమన'ను యువహీరో విజయ్ దేవరకొండతో తీసేందుకు పూరీ జగన్నాథ్ సిద్ధమవుతున్నాడని సమాచారం. హీరో రామ్ రెడీ అంటే 'ఇస్మార్ట్ శంకర్​'కు సీక్వెల్​ 'డబుల్ ఇస్మార్ట్'ను ​తీయనున్నాడీ దర్శకుడు. రణ్​వీర్​ సింగ్ హీరోగా బాలీవుడ్​లో 'ఇస్మార్ట్ శంకర్​'ను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. వీటిలో ఏది నిజమైనా ప్రేక్షకులకు పండగే. ప్రస్తుతానికైతే ఓ రెండు నెలల విరామం తీసుకోవాలని భావిస్తున్నాడు ఈ పోకిరి డైరక్టర్.

ఇది చదవండి: పూరీ ఇంక సెలవు తీసుకుంటాడట..

Last Updated : Jul 22, 2019, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details