తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2019, 6:16 AM IST

ETV Bharat / sitara

'శరీరాకృతి గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం'

అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, తాప్సీ తదితరులు నటించిన బాలీవుడ్ చిత్రం 'మిషన్ మంగళ్'. ఈ సినిమాలోని హీరోయిన్ల గురించి నిత్య.. కొన్ని విషయాలు పంచుకుంది.

నిత్యా మేనన్

ప్రముఖ నటి నిత్యా మేనన్‌.. మరో నటి తాప్సీలు కలిసి నటించిన చిత్రం 'మిషన్‌ మంగళ్‌'. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మూవీలో నటించిన నటుల గురించి చెప్పుకొచ్చింది నిత్య.

"మిషన్‌ మంగళ్‌ సినిమా చేసేంత వరకు నేను తాప్సీతో కలిసి మాట్లాడలేదు. తాప్సీ దక్షిణాదిలో చాలా సినిమాలు చేసింది. అయినా ఎప్పుడూ మేమిద్దరం తారసపడలేదు. అందుకనే ఆమెతో నేను మాట్లాడలేక పోయా. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను దక్షిణాది కంటే బాలీవుడ్‌ పక్కా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇక్కడ నటీనటులతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న కాలం మేమంతా జట్టులా కలిసి పనిచేశాం".

"విద్యాబాలన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మేమిద్దరం కలిసి 'ఎన్టీఆర్‌: కథానాయకుడు' సినిమాలో నటించాం. 'మిషన్‌ మంగళ్‌’' చిత్రంలో ఆడవాళ్లదే రాజ్యం అన్నట్లు ఉంటుంది. సెట్లో అక్షయ్‌ కుమార్‌ చాలా సరదాగా ఉంటారు".

"సహజంగా కథానాయికల లావు, సన్నం గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కొంతమంది తిన్నా, తినకపోయినా లావుగా ఉంటారు. అది ఊబకాయం కావచ్చు. హర్మోన్ల ప్రభావమూ ఉండవచ్చు. అంతే కానీ వ్యాయామం చేయకపోవడం అనేది నిజం కాదు. కథానాయికల బరువు పెరగడం - తగ్గడం అనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేయడం మానుకుంటే మంచిది. ఇలాంటి విషయాల గురించి అసలు మాట్లాడకపోవడం ఉత్తమం" అంటూ నిత్యా మేనన్ చెప్పుకొచ్చింది.

నిత్యమేనన్, తాప్సి, విద్యాబాలన్, అక్షయ్‌ కుమార్‌ కలిసి నటించిన 'మిషన్‌ మంగళ్‌' ఆగస్టు 15, 2019న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్

ABOUT THE AUTHOR

...view details