తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2020, 5:10 PM IST

ETV Bharat / sitara

సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ 'సో క్యూట్'​: రష్మిక

'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​తో తన కెమిస్ట్రీ అద్భుతమని చెప్పింది హీరోయిన్ రష్మిక. వీటితోపాటే ఆదివారం ట్విట్టర్​లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిందీ భామ.​

సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ 'సో క్యూట్'​: రష్మిక
'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​-రష్మిక

హీరోయిన్ రష్మిక మందణ్న.. సూపర్​స్టార్ మహేశ్​బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించే అవకాశం దక్కించుకొని అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య 'హీ ఈజ్​ సో క్యూట్' అంటూ సాగే ఓ మెలోడీ గీతమూ ఉంది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. నేడు(ఆదివారం) ప్రీరిలీజ్​ ఈవెంట్​ జరగనుంది. ఈ సందర్భంగా ట్విట్టర్​లోని తన ఫాలోవర్స్​తో ముచ్చటించింది. వారడగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

'సరిలేరు నీకెవ్వరు' పాట షూటింగ్​లో మహేశ్​-రష్మిక

ఇందులో భాగంగా ఓ నెటిజన్.. "మీకు మహేశ్​కు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా?" అని రష్మికను అడిగాడు. సమాధానంగా.. "చిత్రంలో తనకూ, మహేశ్​కు మధ్య క్యూట్​ రిలేషన్​షిప్​ ఉంటుందని, మీరడగిన లాంటి సీన్స్​ ఉండవంది. అయితే ఆన్​ స్క్రీన్​లో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది" అని రష్మిక చెప్పింది.

ఈ చిత్రంలో మేజర్​ అజయ్​కృష్ణగా మహేశ్​ కనిపించనున్నాడు. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజు-అనిల్ సుంకర-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: ''అభిమానుల అంచనాలను మించేలా 'సరిలేరు' ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details