తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2019, 2:03 PM IST

ETV Bharat / sitara

మరో సినిమాకు కల్యాణి గ్రీన్ సిగ్నల్..?

'హలో' సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన నటి కల్యాణి ప్రియదర్శన్. తాజాగా 'చిత్రలహరి'లో నటించి మెప్పించింది. ఈ హీరోయిన్ తెలుగులో మరో సినిమా ఒప్పుకుందని సమాచారం.

కల్యాణి ప్రియదర్శన్

'ఛలో' ఫేం వెంకీ కుడుముల, యంగ్ హీరో నితిన్​తో తెరకెక్కిస్తున్న చిత్రం 'భీష్మ'. ఇందులో ఇప్పటికే రష్మిక మందణ్నను హీరోయిన్​గా తీసుకోగా మరో కథానాయిక కోసం కల్యాణిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

'చిత్రలహరి' విజయంతో తెలుగులో మరిన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడింది కల్యాణి. ప్రస్తుతం కోలీవుడ్​లో కార్తి సరసన ఓ సినిమాలో, మలయాళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ కేరళ బ్యూటీ.

ఇవీ చూడండి.. 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ఎవరు?

ABOUT THE AUTHOR

...view details