తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రేక్షకుల్ని నవ్వించడమే 'జాతిరత్నాలు' ధ్యేయం'

సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్రవిశేషాల్ని పంచుకుంది 'జాతిరత్నాలు' బృందం. ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Feb 27, 2021, 4:28 PM IST

Updated : Feb 27, 2021, 7:17 PM IST

jathi-ratnalu-movie-team-press-meet
'ప్రేక్షకుల్ని నవ్వించడమే 'జాతిరత్నాలు' ధ్యేయం'

ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే తమ ధ్యేయమని, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుల శైలిలో తమ సినిమా అలరిస్తుందని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయన నిర్మాతగా మారి తెరకెక్కించిన 'జాతిరత్నాలు'.. మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

జాతిరత్నాలు మూవీ టీమ్

ఈ కార్యక్రమానికి ప్రధాన పాత్రధారులు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, దర్శకుడు అనుదీప్ హాజరయ్యారు. రధన్ సంగీతమందించిన 'జాతిరత్నాలు'లోని 'చిట్టి'తో పాటు మిగిలిన పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

Last Updated : Feb 27, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details