తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 3:34 PM IST

ETV Bharat / sitara

'మీటూ' ఆరోపణలు.. అనురాగ్​కు మద్దతుగా సెలబ్రిటీలు

దర్శకుడు అనురాగ్​ కశ్యప్​పై నటి పాయల్ ఘోష్.. శనివారం ట్విట్టర్​ వేదికగా మీటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు అతడికి మద్ధతుగా నిలిచారు. ఇవి నిరాధార ఆరోపణలు అని అన్నారు.

Anurag Kashyap
అనురాగ్​ కశ్యప్​

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అనురాగ్​ కశ్యప్​పై వచ్చిన మీటూ ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, అతడికి మద్దతుగా నిలిచారు. తనపై గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ, నటి పాయల్ ఘోష్.. అనురాగ్​పై శనివారం ట్విట్టర్​ వేదికగా ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్​ చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ ఆరోపణలను కశ్యప్​ ఖండించారు.

దర్శకుడు అనుభవ్​​ సిన్హా అనురాగ్​కు మద్దతు తెలుపుతూ ఆదివారం ట్వీట్​ చేశారు. మీటూ ఉద్యమం ముఖ్య ఉద్దేశం వేధింపులకు గురైన మహిళల గొంతును వినిపించడానికేనని.. దానిని దుర్వినియోగపరిచేందుకు కాదని అన్నారు. అవకాశాల కోసమే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని నటి సుర్వీన్​ చావ్లా పేర్కొంది. 'సేక్రడ్ గేమ్స్​' వెబ్​సిరీస్​ కోసం అనురాగ్​తో కలిసి ఈమె పనిచేసింది.

మరోవైపు ప్రతిభను మాత్రనే చూసి వారికి మద్దతుగా నిలబడే వ్యక్తుల్లో కశ్యప్​ ఒకరని నటి టిస్కా చోప్రా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details