తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2020, 12:04 PM IST

Updated : Jun 1, 2020, 2:54 PM IST

ETV Bharat / sitara

'అది ఫేక్​న్యూస్​.. చట్టపరమైన చర్యలు​ తీసుకుంటా'

తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన అక్షయ్ కుమార్.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

Akshay Kumar refutes claims of booking charter flight for sister
'అది ఫేక్​ న్యూస్​.. లీగల్​ యాక్షన్​ తీసుకుంటా'

తన సోదరి కోసం ఓ ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశాననే వార్తల్లో నిజం లేదని బాలీవుడ్​ స్టార్​హీరో అక్షయ్​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతడి సోదరి అల్కా భాటియా.. తన పిల్లలతో సహా ముంబయి నుంచి దిల్లీకి వెళ్లేందుకు అక్షయ్ ఓ ప్రత్యేక విమానాన్ని బుక్​ చేశాడనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు​.

"నా సోదరి, ఆమె ఇద్దరు పిల్లల కోసం ఛార్టెడ్​ విమానాన్ని బుక్​ చేశా'.. అనే వార్తలు అసత్యాలు. లాక్​డౌన్​ అమలు చేసినప్పటి నుంచి తాను ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. మరో విషయమేమిటంటే ఆమెకు ఒక్కరే సంతానం. ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ కథానాయకుడు

ఈ మధ్య ఓ మ్యూజిక్​ వీడియోలో అక్షయ్ నటించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ ట్వీట్​ చేశారు. "కరోనా సంక్షోభంలో చాలా అసత్య వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఫేక్​ కాస్టింగ్​నూ నాకు జత చేస్తున్నారు" అని వెల్లడించారు అక్కీ.

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన ఈ హీరో.. కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన ఓ యాడ్​ కోసం, బల్కీ దర్శకత్వంలోనూ నటించారు.

ఇదీ చూడండి... ఆ అడవుల్లో బన్నీ 'పుష్ప' షూటింగ్!

Last Updated : Jun 1, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details