తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పింఛను కోసం పడిగాపులు కాస్తూ వృద్ధురాలు మృతి

పింఛను కోసం నాలుగు రోజుల నుంచి పడిగాపుల కాస్తూ ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అజీజ్​నగర్​లో జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.

By

Published : Sep 15, 2020, 10:41 PM IST

old woman died in rangareddy district
పింఛను కోసం పడిగాపులు కాస్తూ వృద్ధురాలు మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్ గ్రామంలో వృద్ధాప్య పింఛను కోసం గత నాలుగు రోజుల నుంచి పడిగాపులు కాస్తూ చెన్నకేశవ దేవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దేవమ్మ చనిపోయిందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details