లోయలో పడిన బస్సు- 16 మంది మృతి
16:49 September 02
లోయలో పడిన బస్సు- 16 మంది మృతి
ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కుర్దిష్ రాష్ట్రంలోని కొర్దెస్తాన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు లోయలోకి(iran bus accident) దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16మంది మరణించారు. 12మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇరాన్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేశంలో ఏటా 17వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్టు అంచనా. సరైన ట్రాఫిక్ చట్టాలు లేకపోవడం, వాహనాల్లో లోపాలుండటం, అత్యవసర సేవలు సరిగ్గా లేకపోవడం ఈ దుర్భర స్థితికి కారణం.