కాబూల్లోని కార్తి సఖి ప్రార్థనా మందిరం పరిసర ప్రాంతాల్లో షైతే ప్రజలు అధికంగా నివసిస్తారు. ఏటా నౌరోజ్ పర్వదినాన సంప్రదాయంగా వేడుకలు జరుపుకుంటారు. ఆకుపచ్చ రంగు జెండాలను ఎగురవేసి, పూర్వీకులను స్మరించుకుంటారు. ఈ పర్షియన్ పండగను మధ్యప్రాచ్యంలో ఘనంగా చేసుకుంటారు.
నౌరోజ్ వేడుకల్లో వరుస పేలుళ్లు...ఐదుగురు బలి - నౌరోజ్
అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పర్షియన్ కొత్త ఏడాది 'నౌరోజ్' వేడుకల్లో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. కాబూల్లోని షైతే ప్రార్థనా స్థలంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.

ఘటనా స్థలంలో పోలీసులు
ప్రార్థనా మందిరంలో పేలుళ్లు
వేడుకల్లో ఉగ్రవాదుల కదలికలపై ఇప్పటికే ప్రజలను అఫ్గాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటివరకూ ఘటనపై ఏ ఉగ్రసంస్థ స్పందించలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు షైతే ముస్లింలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. సున్నీ మిలిటెంట్ సంస్థలు షైతే ముస్లింలను మతవిరోధులుగా భావించటమే ఇందుకు కారణం.