తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ పార్లమెంటు నెలరోజుల పాటు రద్దు

బ్రిటన్​ పార్లమెంటును నెలరోజుల పాటు రద్దు చేయాలన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. తన బ్రెగ్జిట్ వ్యూహాన్ని ఎంపీలు అడ్డుకోవాలని చూస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు బోరిస్.

By

Published : Sep 10, 2019, 5:52 AM IST

Updated : Sep 30, 2019, 2:10 AM IST

బ్రిటన్​ పార్లమెంటు నెలరోజుల పాటు రద్దు

బ్రిటన్ పార్లమెంటు నేటి నుంచి నెలరోజుల పాటు తాత్కాలికంగా రద్దు కానుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఎంపీలు ముందుకు సాగనీయడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​.

బ్రిటన్‌ పార్లమెంట్‌ సమావేశాలను సస్పెండ్‌ చేయాలన్న జాన్సన్‌ వినతికి క్వీన్ ఎలిజబెత్‌ రాణి-2 గత నెలలో ఆమోదం తెలిపారు. బ్రెగ్జిట్‌కు సరికొత్త శాసన అజెండాను ఆవిష్కరించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా సస్పెండ్‌ చేయాలని ఎలిజబెత్​ను కోరారు జాన్సన్​.

బోరిస్​​ నిర్ణయంపై విపక్షం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్రెగ్జిట్‌పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు విపక్ష ఎంపీలు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్ వైదొలిగేందుకు రూపొందించిన బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోరిస్ సొంత పార్టీకి చెందిన ఎంపీలు విపక్షానికి మద్దతుగా నిలుస్తున్నారు.

బ్రెగ్జిట్​ను వ్యతిరేకిస్తున్న 21మంది అధికార కన్సర్వేటివ్ ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించారు బోరిస్​.

Last Updated : Sep 30, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details