తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2019, 10:35 AM IST

Updated : Sep 30, 2019, 2:34 AM IST

ETV Bharat / international

పార్లమెంట్​ రద్దుకు ముందు బోరిస్​కు ఎదురుదెబ్బ

ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగే అంశంలో బ్రస్సెల్స్​తో కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్​ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు జరపాలన్న తన విజ్ఞప్తిని పార్లమెంట్​ రెండోసారి తోసిపుచ్చిన తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు.

బ్రస్సెల్స్​తో కొత్త బ్రెగ్జిట్​ ఒప్పందం : బోరిస్​

పార్లమెంట్​ రద్దుకు ముందు బోరిస్​కు ఎదురుదెబ్బ

కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు బ్రస్సెల్స్​తో చర్చలు జరపనున్నట్లు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు జరపాలన్న విజ్ఞప్తిని పార్లమెంట్​ రెండోసారి తోసిపుచ్చిన అనంతరం... బోరిస్​ ఈ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం బ్రెగ్జిట్​ను ఏ మాత్రం ఆలస్యం చేయదని స్పష్టం చేశారు.

ఐదు వారాలపాటు బ్రిటన్​ పార్లమెంట్​ సస్పెండ్ కానుంది. దీనికి ముందు ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షాల వైఖరిని జాన్సన్ తప్పుపట్టారు. వచ్చే నెలలో బ్రస్సెల్స్​లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగే అంశంపై (బ్రెగ్జిట్​) కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి శ్రమిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ముందుస్తుకు నో..

బ్రిటన్ చట్టం ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే... పార్లమెంట్​లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అయితే... బ్రస్సెల్స్​తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే.. లేదా బ్రెగ్జిట్​ను పొడిగించేందుకు ప్రధాని బోరిస్​ జాన్సన్​ అంగీకరిస్తేనే ముందస్తు ఎన్నికలకు ఒప్పుకుంటామని ప్రతిపక్షాలు తేల్చిచెప్పాయి.

ఇదీ చూడండి: భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి: ట్రంప్​

Last Updated : Sep 30, 2019, 2:34 AM IST

ABOUT THE AUTHOR

...view details