తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ అరేబియాలో 37 మందికి మరణదండన

సౌదీ అరేబియాలో 37 మంది పౌరులకు మరణ శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. మూడేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి సామూహికంగా దండన అమలు చేశారు.

By

Published : Apr 24, 2019, 6:16 AM IST

సౌదీలో మరణదండన

సౌదీ అరేబియాలో మరోసారి సామూహిక మరణ దండన విధించింది అక్కడి ప్రభుత్వం. మూడేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితులుగా ఉన్న 37 మందికి శిక్ష అమలు చేసింది. రియాద్, మక్కా మదీనా, ఖాసిమ్​ ప్రాంతాల్లో ఈ శిక్షలను అమలు చేశారు.

"ఉగ్ర, వేర్పాటు వాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారికి శిక్షను అమలు చేశారు. అందులో ఓ వ్యక్తికి నేర తీవ్రతను బట్టి శిక్ష అనంతరం శిలువ వేశారు."

-సౌదీ ప్రభుత్వ వార్తా సంస్థ

వివరాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 100 మందికి సౌదీలో మరణ శిక్ష విధించారు.

ABOUT THE AUTHOR

...view details