తెలంగాణ

telangana

విమానం హైజాక్​- లగేజీ దొంగలించి పరార్

By

Published : Nov 26, 2019, 4:28 PM IST

పపువా న్యుగినియాలో విమానం హైజాక్​కు గురైంది. ఇదేదో మనుషుల్ని భయపెట్టి, ప్రభుత్వాలను మభ్యపెట్టడానికి ఉగ్రమూకలు చేసిన పని కాదండోయ్. కేవలం విమానంలోని లగేజీని దొంగలించడానికి చేసిన పని.

'Armed men' hijack Papua New Guinea plane, steal baggage
విమానం హైజాక్​- లగేజీ దొంగలించి పరార్

పపువా న్యూగినియాలో చార్టర్ ఎయిర్​లైన్​కు చెందిన విమానం హైజాక్​కు గురైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. విమానం ఇంధనం నింపుకోవడానికి ఆగిన సమయంలో ఆయుధాలు ధరించిన వ్యక్తులు లోపలికి చొరబడి విమానాన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లేలా పైలట్​ను హెచ్చరించినట్లు తెలిపింది. ఉపయోగంలో లేని ఎయిర్​స్ట్రిప్​పై ల్యాండ్​ అయి, పరారైనట్లు వివరించింది.

"విమానాన్ని గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత లోపల ఉన్న వస్తువులు, సరుకులను దొంగలించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. పైలట్​కు ఎలాంటి గాయాలు కాలేదు."
-మాథ్యూ బ్రట్నాల్, విమాన సంస్థ ప్రతినిధి

హైజాక్ జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. అనంతరం విమానం పోర్ట్​ మోర్స్​బై ప్రాంతానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాయల్ పపువా న్యూగినియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details