తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక పర్యటక రంగంపై పేలుళ్ల ప్రభావం!

శ్రీలంకను ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఆ దేశ పర్యటక రంగాన్ని ఈ ఘటన కోలుకోలేని దెబ్బతీసే అవకాశముంది.

By

Published : Apr 22, 2019, 9:16 AM IST

శ్రీలంక పర్యాటక రంగంపైనా పేలుళ్ల ప్రభావం

8 వరుస బాంబు పేలుళ్లతో ఆదివారం శ్రీలంక దద్దరిల్లింది. జనజీవనం స్తంభించింది. పేలుళ్లకు దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 450 మందిపైగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆదివారం నాటి ఘటన ఆ దేశ పర్యటక రంగంపైన భారీ ప్రభావం చూపే అవకాశముంది.

2018 నవంబరులో ఈ రంగం నుంచి రూ. 36 కోట్ల 27 లక్షలు అర్జించింది శ్రీలంక. గతేడాది సుమారు 23 లక్షల మంది విదేశీయులు లంకలో పర్యటించారు. పేలుళ్ల ఘటనతో వారి సంఖ్య భారీగా తగ్గిపోతుందని పర్యటక రంగంపై ఆధారపడ్డవారు ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయులే అధికం...

లంకలో పర్యటించే విదేశీయుల్లో అత్యధిక మంది భారతీయులే. 2018లో 4 లక్షల 50 మంది భారతీయులు పర్యటించారు. ఈ ఏడాది ఆ సంఖ్య పది లక్షలకు చేరుతుందని తొలుత అంచనా వేశారు. పేలుళ్లతో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది.

ఇదీ చూడండి: 'శ్రీలంక పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మృతి'

ABOUT THE AUTHOR

...view details