తెలంగాణ

telangana

ETV Bharat / international

మారిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు- కొత్త లెక్క ఇలా...

ఎవరెస్ట్​ శిఖరం తాజా ఎత్తును సంయుక్తంగా ప్రకటించాయి నేపాల్-చైనా. 8848.86 మీటర్ల ఎత్తు ఉందని వెల్లడించాయి. గత లెక్కలకన్నా ఇది 86 సెంటీమీటర్లు ఎక్కువ.

By

Published : Dec 8, 2020, 2:08 PM IST

Updated : Dec 8, 2020, 2:38 PM IST

Mount Everest
మారిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు- కొత్త లెక్కలు ఇలా...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్​ ఎవరెస్ట్​.. తాజా ఎత్తును సంయుక్తంగా ప్రకటించాయి నేపాల్-చైనా​. ఆ శిఖరం 8,848.86 మీటర్ల(29,032 అడుగులు) ఎత్తు ఉందని వెల్లడించింది. పాత లెక్కల కన్నా ఇది 86 సెంటీమీటర్లు ఎక్కువ.

2015లో వచ్చిన భూకంపంతో పాటు ఇతర కారణాల వల్ల.. ఎవరెస్ట్​ ఎత్తు తగ్గిపోయిందన్న ఊహాగానాల నేపథ్యంలో సర్వే చేపట్టింది నేపాల్​. ఏడాది పాటు సాగిన ఈ ప్రక్రియలో చైనా సాయం తీసుకుంది.

2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నేపాల్​ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్​ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారత సర్వే విభాగం 1954లో ఎవరెస్ట్​ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా తేల్చింది. అప్పటి నుంచి అవే గణాంకాలు ప్రామాణికంగా ఉన్నాయి.

ఇదీ చూడండి: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!

Last Updated : Dec 8, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details