తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో పడవల మునక.. 31 మంది మృతి

ఫిలిప్పీన్స్​ సముద్రంలో మూడు పడవలు మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 31 మంది మృతి చెందారు. ముగ్గురి ఆచూకీ గల్లంతయింది. పడవల్లోని 62 మంది ప్రయాణికులు, సిబ్బందిని రక్షించింది తీర ప్రాంత రక్షక దళం.

By

Published : Aug 5, 2019, 8:05 AM IST

ఫిలిప్పీన్స్​లో మునిగిన 3 పడవలు

ఫిలిప్పీన్స్​లో వీస్తున్న ప్రచండ గాలుల కారణంగా... సముద్రంలో మూడు పడవలు మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 31 మంది మృతిచెందారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతయింది.

ఫిలిప్పీన్స్​లో పడవల మునక

గుయిమారస్​, ఇలోయిలో రాష్ట్రాల్లో శనివారం ఆకస్మికంగా తీవ్రమైన గాలులు, శక్తిమంతమైన తరంగాలతో రెండు పడవలు బోల్తా పడి చాలా మంది ప్రయాణికులు చనిపోయారని తీర ప్రాంత రక్షక దళం అధికారులు తెలిపారు. అందులోని 62 మంది ప్రయాణికులు, సిబ్బందిని రక్షించినట్లు పేర్కొన్నారు. మూడో పడవ బోల్తా పడినప్పటికీ.. అందులో ప్రయాణికులెవరూ లేనందున పెద్ద ప్రమాదం తప్పింది.

దేశంలోని తూర్పు తీరంలో సుమారు 1000 కిలోమీటర్ల మేర భారీ వర్షాలు, పిడుగులతో పాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని మనీలాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ప్రతి ఏటా సుమారు 20 వరకు తుపాన్లు ఫిలిప్పీన్స్​ను అతలాకుతలం చేస్తాయి. పసిఫిక్​ తుపాను, భూకంప తీరంలో ఉన్న ఈ ద్వీప సమూహం ప్రపంచంలోనే అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటిగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details