తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2021, 3:55 PM IST

ETV Bharat / crime

కుమార్తెతో సహా ఎస్సారెస్పీలో దూకి మహిళ ఆత్మహత్య

మూడేళ్లతో చిన్నారితో కలిసి ఓ మహిళ ఎస్సారెస్పీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలో చోటుచేసుకుంది.

Woman commits suicide
కూతురితో సహా ఎస్సారెస్పీలో దూకి మహిళ ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలో మూడేళ్ల చిన్నారితో సహా ఓ మహిళ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. లెఫ్ట్ పోచంపాడ్ గ్రామానికి చెందిన పావని(26) తన కుమార్తెతో మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

గురువారం ఇద్దరి మృతదేహాలు ప్రాజెక్టులో కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జీవన్​రెడ్డి పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని ఎస్సై పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details