అప్పులబాధతో పురుగుల మందు తాగి దంపతులతోపాటు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పుత్తూరు మండలం రాచపాలానికి చెందిన శంకరయ్య(55), గురవమ్మ(45), వినయ్(25)గా పోలీసులు గుర్తించారు.పెద్దకుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.