తెలంగాణ

telangana

ETV Bharat / crime

నకిలీ సర్టిఫికెట్ దందాలో భోపాల్‌ సర్వేపల్లి వర్సిటీ వీసీ అరెస్టు

Fake Certificates Case Updates : నకిలీ సర్టిఫికెట్‌ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏడుగురు ఏజెంట్లు, 19 మంది విద్యార్థులు, ఆరుగులు తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మాజీ వీసీ, ప్రస్తుత వీసీలను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటీకి చెందిన గత, ప్రస్తుత వీసీలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Fake Certificates Case Updates
Fake Certificates Case Updates

By

Published : May 18, 2022, 3:23 PM IST

Updated : May 19, 2022, 12:24 PM IST

Fake Certificates Case Updates : నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటీకి చెందిన గతంలో వీసీగా పని చేసిన కుష్వా, తాజా వైస్ ఛాన్సెలర్‌ ప్రశాంత్ పిళ్లైలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు ఏజెంట్లు, 19 మంది విద్యార్థులు, ఆరుగులు తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఈ దందాలో యూనివర్సిటీ వీసీలను అరెస్టు చేయడం చర్చనీయాంశమవుతోంది.

VC arrest in Fake Certificates Case : ఏజెంట్ల ద్వారా విద్యార్థుల వివరాలు తీసుకుని ఒక్కో కోర్సుకు ఒక్కో రేటు నిర్ణయించి దందా చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి ఫిబ్రవరిలో హైదరాబాద్‌ మలక్‌పేటలో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా.. ఆ తర్వాత ఆసిఫ్‌నగర్, చాదర్‌ఘాట్, ముషీరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అర్హత లేకుండా సర్టిఫికెట్లు పొంది కొంతమంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సర్వేపల్లి యూనివర్సిటీలో వీసీ కుష్వా(2017) పనిచేస్తున్నప్పటి నుంచి ఈ దందా సాగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు యూనివర్సిటీల్లో ఏడు సిట్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.

Last Updated : May 19, 2022, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details