తెలంగాణ

telangana

ETV Bharat / crime

'కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది'

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Feb 23, 2021, 10:59 PM IST

Married disappearance in Warangal rural district
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది

కళాశాలకని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె చరవాణి సిగ్నల్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన గుగులోతు జ్యోతి(20) ఈ నెల 19న హన్మకొండలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు రాయపర్తి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు

ABOUT THE AUTHOR

...view details