ఖమ్మం జిల్లా పాలేరు, మధిర నియోజకవర్గాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట ముదిగొండ మండలంలోని కొత్త లక్ష్మీపురంలో 2 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో 12 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రెండు కోట్ల 25 లక్షల రూపాయలతో డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. కూసుమంచి మండలం గట్టు సింగారంలో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.