తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 10:21 PM IST

ETV Bharat / city

పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు అందజేత

లాక్​డౌన్​ అమలులో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసుల కోసం పలువురు తమ వంతు సాయం చేస్తున్నారు. యూరో లాజిస్టిక్స్​, ఇండస్​ ఆస్పత్రి యజమానులు తమవంతు సాయంగా మాస్కులు, శానిటైజర్లు సీపీ మహేశ్​భగత్​కు అందజేశారు.

Telangana news
రాచకొండ సీపీ మహేశ్​ భగత్​

కొవిడ్​ కట్టడిలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా పనిచేస్తున్న పోలీసులకు పలువురు అండగా నిలుస్తున్నారు. రాచకొండ కమిషనరేట్​ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల కోసం శానిటైజర్లు, మాస్కులు, పండ్లు అందించారు.

యూరో లాజిస్టిక్స్, ఇండస్ ఆస్పత్రి, పలు స్వచ్ఛంద సంస్థల యజమానులు తమ వంతు సాయంగా ఈ కిట్లను సీపీ మహేశ్​ భగత్​కు అందించారు. వాటిని విధుల్లో ఉన్న పోలీసులకు అందించాలని కోరారు.

ఇదీ చూడండి:super spreaders: పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​

ABOUT THE AUTHOR

...view details