తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 3:30 PM IST

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు.. 13 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో ఇవాళ కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 21,197కు చేరాయి. మరో 13 మంది వైరస్​తో మృతి చెందారు. ఇప్పటి వరకు 252 మంది ప్రాణాలు కోల్పోయారు.

andhra pradesh corona cases
ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి వారు 23 మందికి సోకినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,197కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,200 మంది చికిత్స పొందుతుండగా.. 9,745 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌తో ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌తో కర్నూలులో 4, అనంతపురం 3, చిత్తూరు, విశాఖపట్నంలో ఇద్దరేసి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 16,238 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details