తెలంగాణ

telangana

ETV Bharat / business

జీడీపీ క్షీణతకు మోదీనే కారణం: కాంగ్రెస్​

స్థూల దేశీయోత్పత్తి తిరోగమనం దిశగా పయనించడంపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్​. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపించింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పోతుందని.. దేశంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించాలని డిమాండ్​ చేసింది.

By

Published : Aug 30, 2019, 9:55 PM IST

Updated : Sep 28, 2019, 10:02 PM IST

జీడీపీ క్షీణత.. మోదీ నిర్మిత విపత్తు: కాంగ్రెస్​

దేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంపై కేంద్రాన్ని తప్పుబట్టింది కాంగ్రెస్​. దీనిని మోదీనే కారణమని తెలిపింది.

జీడీపీ తిరోగమనానికి జాతీయ, అంతర్జాతీయ అంశాలే కారణమన్న ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రకటన సరికాదని తెలిపింది. జీడీపీ క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవని పేర్కొన్నారు కాంగ్రెస్​ ప్రతినిధి రాజీవ్​ గౌడ. '' కుంగిపోతున్న ఆర్థిక నావ.. పెరిగిపోతున్న కుంభకోణాల''పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

''జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి చేరింది. నోట్ల రద్దు, తొందరపాటు జీఎస్​టీ వంటి అసమర్థ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. స్థూల దేశీయోత్పత్తి క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవు. దీనికి పూర్తిగా మోదీనే కారణం.''

- రాజీవ్​ గౌడ, కాంగ్రెస్​ ప్రతినిధి

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రకటనపైనా కాంగ్రెస్​ మండిపడింది. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పోతుందని.. బ్యాంకింగ్​ వ్యవస్థ నాశనమవుతుందని పేర్కొంది. ఈ విలీనంతో బ్యాంకుల రీక్యాపిటలైజేషన్​ అన్నింటికీ సమానంగా ఉందా అని ప్రశ్నించిన హస్తం పార్టీ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అడిగింది.

నిరర్థక ఆస్తుల వివరాలను వెల్లడించాలని కోరింది. తాజా పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని.. కేంద్రం దీనిని అంగీకరించక తప్పదని పేర్కొంది.

Last Updated : Sep 28, 2019, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details