తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి ధర రికార్డు.. రూ.40 వేలకు చేరువలో..

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు మళ్లీ దూసుకెళ్లాయి. 10గ్రాముల మేలిమి బంగారం ధర రూ.300 పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. వెండి కిలోకు ఏకంగా రూ.2,110 పెరిగింది.

By

Published : Aug 28, 2019, 5:26 PM IST

Updated : Sep 28, 2019, 3:13 PM IST

బంగారం

బంగారం ధరలు నేడు తాజా రికార్డు నమోదు చేశాయి. గత సెషన్​లో స్థిరంగా ఉన్న పుత్తడి ధర నేడు 10 గ్రాములకు రూ.300 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,970లకు చేరింది. పండుగ సీజన్​ కారణంగా దేశీయంగా నగల వ్యాపారుల నుంచి వచ్చిన భారీ డిమాండుతో పసిడి ధరలు పెరిగినట్లు ఆల్​ ఇండియా సరఫా అసోసియేషన్​ తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయంగా నెలకొన్న వృద్ధి భయాలతో మదుపరులు పసిడిపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తుండటమూ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.2,110 పెరిగి.. రూ.48,850కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదార్ల నుంచి వచ్చిన డిమాండు మేరకు వెండి ధరలు పుంజుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాలో ఔన్సు బంగారం ధర 1,543 డాలర్లుగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సుకు 18.38 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: అదిరే ఆఫర్లు తెచ్చిన స్పైస్​ జెట్​, ఇండిగో!

Last Updated : Sep 28, 2019, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details